
ఫెయిలైంది ప్రభుత్వమే!
కర్నూలు కల్చరల్: పదో తరగతి మూల్యాంకనంలో ఫెయిలైంది విద్యార్థులు కాదని ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు ప్రశాంత్ అన్నారు. శుక్రవారం వైఎస్సార్సీపీ ఎస్యూ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో డిప్యూటీ ఈవో భూషణ్, ఏడీ అసదుల్లా ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఎలాంటి ఫీజులు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలన్నారు. తుది ఫలితాలు వచ్చే వరకు పదో తరగతి మార్కుల ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్ని రోజుల పాటు నిలిపేయాలన్నారు. మూల్యాంకన లోపాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో జిల్లా ఉపాధ్యక్షులు మణిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కటారు కొండ సాయికుమార్, నగర అధ్యక్షులు అన్సూర్, నాయకులు సంతోష్, మధుమోహన్, హేమంత్, సృజల్ తదితరులు ఉన్నారు.