ప్రభుత్వ బడిని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం

Jun 30 2025 7:34 AM | Updated on Jun 30 2025 7:46 AM

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రభుత్వ బడులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనా ఉందని, సర్కార్‌ బడుల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు అన్నారు. యూటీఎఫ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రజలకు నమ్మకం కలిగే విధంగా పని చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల దగ్గర చదివించాలని కోరారు. ప్రభుత్వం ఉపాధ్యాయులని బోధనకి ఎక్కువ సమయం కేటాయించే విధంగా చూడాలని, ఆన్‌లైన్‌ పనులను ప్రభుత్వం చెప్పటం మానుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పీ మనోహర్‌కుమార్‌ మాట్లాడుతూ మోడల్‌ ప్రైమరీ కాన్సెప్ట్‌ను వినియోగించుకుని, ఉపాధ్యాయ సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేసి ప్రాథమిక పాఠశాలల రోల్‌ పెంచాలని కోరారు.

ఐక్యంగా పోరాటం..

జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య మాట్లాడుతూ గతకాలం సంఘం కార్యకలాపాల రిపోర్ట్‌ను ప్రవేశపెట్టారు. జరిగిన బదిలీల విషయంలో ఉపాధ్యాయ సంఘాలను ఐక్యంగా నడిపి ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వంతో మాట్లాడి అనేక సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కె. శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సీహెచ్‌ శ్రీనివాస్‌, నాయకులు మచ్చా శ్రీనివాస్‌, ఎం. కృష్ణయ్య, పి. నాగేశ్వరరావు, హరిప్రసాద్‌, కె. గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement