
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళాన్ని సమ ర్పించారు. విజయవాడ శాంతినగర్కు చెందిన కొత్తమాసు వంశీధర్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చే సింది. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
ఉత్తమ బహుమతికిరెండు నవలలు ఎంపిక
విజయవాడ కల్చరల్: డాక్టర్ అక్కినేని నాగేశ్వరరవు శత జయంతి సందర్భంగా సిరికోన సాహితీ అకాడమీ ఆధ్వర్యంలో సిరికోన – జొన్నలగడ్డ రాంభట్ల సరోజనమ్మ స్మారక నవలా రచన పోటీకి వచ్చిన వాటి నుంచి రెండింటిని ఉత్తమ నవలలుగా ఎంపిక చేశా మని సిరికోన సాహితీ అకాడమీ బాధ్యుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం బుధవారం ఓ ప్రక టనలో తెలిపారు. తెలుగు చిత్రకళకు జీవం పోసిన మహానటుల్లో ఒకరైన నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పోటీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కళానుభవం, పాత్రల చిత్రీ కరణ, నవలా శిల్పం అంశాలను పరిగణలోకి తీసుకొని రెండు నవలలను ఎంపిక చేశామని పేర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన డాక్టర్ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమా రమణ’, హ్యూస్టన్ నగరానికి చెందిన కోసూరి ఉమా భారతి రచించిన ‘హృదయగానం : నేడే విడుదల’ నవలలను ఎంపిక చేశామని వివరించారు. మంధా భానుమతి రచించిన ‘కచ్ఛపి నాదం’ నవలను ప్రత్యేక బహుమతికి ఎంపిక చేశామని పేర్కొన్నారు.
కొండలమ్మ సేవలోదేవదాయ కమిషనర్
గుడ్లవల్లేరు: మండలంలోని వేమవరంలో వేంచేసిన శ్రీ కొండలమ్మ అమ్మవారిని దేవదాయ కమిషనర్ ఎస్.సత్యనారాయణ బుధవారం దర్శించుకున్నారు. ఆయన్ను ఆలయ ఈఓ సురేష్, చైర్మన్ శేషం గోపి ఆలయ మర్యాదలతో సన్మానించి అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలను అందజేశారు. తొలుత దేవదాయ కమిషనర్ పేరిట అమ్మవారికి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కమిషనర్ ఆలయ రికార్డులను పరిశీలించారు. దేవదాయ తనిఖీ అధికారి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక
చిలకలపూడి(మచిలీపట్నం): కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులు కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక సూచించారు. జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాలులో మచిలీపట్నం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి మాట్లాడుతూ.. న్యాయవాదులు లోక్ అదాలత్ను వినియో గించి కక్షిదారులకు సత్వర పరిష్కారం అందించేలా చూడాలన్నారు. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు బూరగడ్డ అశోక్కుమార్ మాట్లాడుతూ.. ఎంతో ప్రాచీనమైన మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తాను ఎన్నికవడాన్ని అదృష్టంగా భావిస్తున్నాన న్నారు. కొత్త కోర్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై హైకోర్టు, ప్రభుత్వాధికారులతో సంప్రదిస్తా నని, ప్రతి సభ్యుడికీ అందుబాటులో ఉండి, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.ఎస్.సాయిబాబు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి విలు వలు కాపాడుతూ బార్ అసోసియేషన్ ఉన్నతికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు నూతన అధ్యక్ష, కార్యదర్శులను, కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు.

