
ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ బోధన
● అదనపు కలెక్టర్ దీపక్ తివారి
ఆసిఫాబాద్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) ద్వారా నాణ్యమైన బోధన అందుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండలంలోని బూర్గుడ ప్రాథమిక పాఠశాలలో శుక్రవా రం విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకం తల్లిదండ్రులకు కలిగించేందుకు ఉపాధ్యాయులు కృషి చే యాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరో జూ పాఠశాలకు పంపించాలని సూచించారు. ఉచి తంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందిస్తారని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకునేలా వారిని తీర్చిదిద్దుతారని వివరించారు. ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయాలని సూ చించారు. బూర్గుడ కాంప్లెక్ హెచ్ఎం సదాశివ్ సొంత ఖర్చుతో 40 మంది విద్యార్థులకు బ్యాగులు, పలకలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్వాలి టీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, సీఆర్ పీ చిట్ల తిరుపతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.