
తెరుచుకున్న మూత‘బడులు’
వల్లకొండ పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంఈవో ప్రభాకర్
ఆసిఫాబాద్రూరల్/కాగజ్గనర్రూరల్: గతంలో మూతబడిన ఆసిఫాబాద్ మండలం రింగన్గూడలోని పాఠశాలను విద్యాశాఖ అధికారులు గ్రామస్తులతో మాట్లాడి గ్రామ పటేల్ ఆత్రం అంబారావు చేతుల మీ దుగా ప్రారంభించారు. ఎంఈవో సుభాష్ మాట్లాడుతూ విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మండలంలో మూతబడిన మూడు పాఠశాలలను పునఃప్రారంభించామని తెలిపారు. రింగన్గూడలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ను కేటాయించామన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు భారతి, సీఆర్పీ సుభా ష్ పాల్గొన్నారు. అలాగే కాగజ్నగర్ మండలం వల్లకొండలో రెండేళ్ల క్రితం మూతబడిన ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు. ఎంఈవో ప్రభాకర్ మాట్లాడు తూ విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, సృజన, అనందిత, జ్ఞానేశ్వర్, సీఆర్పీ ఉమేశ్ పాల్గొన్నారు.

తెరుచుకున్న మూత‘బడులు’