కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

May 2 2025 1:15 AM | Updated on May 2 2025 1:15 AM

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

పెంచికల్‌పేట్‌(సిర్పూర్‌): వరిధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. పెంచికల్‌పేట్‌ మండలం ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అ ధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గొంట్లపేట్‌లో కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్‌, ఏపీఎం కొనయ్య, ఏఈవోలు శ్రీవిద్య, గౌసియాబేగం, బీజేపీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌, నాయకులు చప్పిడే సత్యనారాయణ, నగేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement