
కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి
పెంచికల్పేట్(సిర్పూర్): వరిధాన్యం కొనుగో లు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. పెంచికల్పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కొనుగోలు కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అ ధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే గొంట్లపేట్లో కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, ఏపీఎం కొనయ్య, ఏఈవోలు శ్రీవిద్య, గౌసియాబేగం, బీజేపీ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు చప్పిడే సత్యనారాయణ, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.