
మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియాలోని వర్క్షాప్లో బుధవారం మహిళా ఉద్యోగులకు క్రీడాపోటీలు నిర్వహించా రు. ఆ సంఘం గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి మాట్లాడుతూ సింగరేణి చరిత్రలో మేడే సందర్భంగా మహిళా ఉద్యోగులకు మొదటిసారిగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటికే గోలేటి సీహెచ్పీ, జీఎం కార్యాలయం, కై రిగూడ ఓసీపీల్లో పోటీలు నిర్వహించగా, అక్కడి మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని అన్నారు. సింగరేణిలో పురుషులతో సమానంగా మహిళలు సత్తా చాటుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ అన్నిరంగాల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్బాబు, కైరిగూడ ఫిట్ కార్యదర్శి మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.