
రెగ్యులర్ అధికారులను నియమించాలి
ఆసిఫాబాద్రూరల్: జిల్లాలో రెగ్యులర్ అధికా రులను నియమించాలని డీవైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సోమవారం మాట్లాడారు. జిల్లాలో రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇన్చార్జీల పాలన కొనసాగుతుందన్నా రు. డీఈవో, డీఎండబ్ల్యూవో, డీబీసీడబ్ల్యూవో, డీఎస్వో, డీఐఈవో ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ జూని యర్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు అందరూ ఇన్చార్జీలే ఉన్నారన్నారు. విద్యా వ్యవస్థ గాడి తప్పుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జి ల్లా అధ్యక్షుడు టీకానంద్, నాయకులు శ్రావణి, నిఖిల్, మంజూల పాల్గొన్నారు.