పకడ్బందీగా నీట్‌ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా నీట్‌ నిర్వహణ

Apr 30 2025 2:02 AM | Updated on Apr 30 2025 2:02 AM

పకడ్బందీగా నీట్‌ నిర్వహణ

పకడ్బందీగా నీట్‌ నిర్వహణ

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో నీట్‌ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పా ఠశాలలో ఏర్పాటు చేసిన నీట్‌ కేంద్రాన్ని మంగళవా రం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ మే 4న నిర్వహించే నీట్‌ కు జిల్లాలో 287 మంది హాజరవుతారని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు కల్పించాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రశ్నపత్రాలను పూర్తి బందోబస్తుతో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పరీక్ష సమన్వయకర్త లక్ష్మీనరసింహ, పర్వవేక్షకులు ఉదయ్‌బాబు, శశిధర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement