
సమ్మె విజయవంతం చేయాలి
పెంచికల్పేట్(సిర్పూర్): లేబర్ కోడ్ల రద్దు కోసం వచ్చే నెల 20న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వెలిశాల క్రిష్ణమాచారి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడారు. కార్మికుల శ్రమ ను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు బీజే పీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పోరా టాలతో సాధించుకున్న హక్కులు కాపాడుకోవాడానికి ప్రతీ కార్మికుడు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకోవా లన్నారు. ఈ సమావేశంలో ఘనపురం శ్రీకాంత్, దిగిడే మల్లిక, పద్మ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.