
గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
● ఎమ్మెల్సీ దండె విఠల్ ● ఆలయంలో పూజలు
తిర్యాణి: ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గీత కా ర్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ జెన్సీ ప్రాంతాల్లో లైసెన్స్లు లేకుండా ఇబ్బందులు పడుతున్న గీత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపా రు. ఎల్లమ్మ గుడి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటా యించి ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం గౌడ కులస్తులు ఎమ్మెల్సీని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్రావు, జిల్లా నాయకుడు జువ్వాజి అనిల్గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్గౌడ్, ప్రచార కార్యదర్శి మార్క శంకర్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిత్తారి సాగర్ తదితరులు పాల్గొన్నారు.