
పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్: పోక్సో కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని, నాణ్యతతో ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో గురువారం నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడు తూ కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు పారదర్శకంగా దర్యాప్తు చేసి, కోర్టులో దాఖలు చేయాలన్నా రు. సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలి సి కేసుల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. కమ్యూనిటీ పోలీ సింగ్ ద్వారా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్, డయల్ 100 వినియోగంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన క ల్పించాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, బియ్యం రవాణా, పశువుల అక్రమ రవాణాపై దృష్టి సారించాలని సూచించారు. తరచూ ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఇతరులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారితోపాటు, గ్రూప్ అడ్మిన్లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఆసిఫాబాద్ సీఐ రవీందర్, ఎస్సై అంజన్న, కానిస్టేబుల్ సాగర్, తిరుపతికి ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అదనపు ఎస్పీ ప్రభాకర్రావు, ఏఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉగ్రదాడి మృతులకు పోలీసుల సంతాపం
ఆసిఫాబాద్: జమ్ముకశ్మీర్లోని పహల్గాం సమీపంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు సంతాపం తెలిపారు. రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

పోక్సో కేసుల విచారణ వేగవంతం చేయాలి