
ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం ఎన్నికలు
కరీంనగర్ టౌన్: ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు. సోమవారం మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలపై కరీంనగర్లో అపెక్స్ కౌన్సిల్ చైర్మన్ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను కలిసి మున్నూరుకాపు రాష్ట్ర ఎన్నికల విధివిధానాలపై సమీక్షించారు. దేవయ్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా సంఘాలు 12వేల గ్రామాల్లో మున్నూరుకాపు సంఘాలున్నాయని, ఈనెల చివరి వారంలో మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు జరుగుతాయని బండి సంజయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపులు రాజకీయాలకతీతంగా ఐక్యంగా ముందుకు సాగి మున్నూరుకాపు కులాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలన్నారు. మున్నూరుకాపు సంఘం యువజన నాయకులు సత్తినేని శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, దాడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాయికల్లో చోరీ
రాయికల్: పట్టణానికి చెందిన చింత ప్రకాశ్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ప్రకాశ్ కంటి ఆపరేషన్ నిమిత్తం నెల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. దీంతో దండగులు ఇంట్లోకి ప్రవేశించి బీరువా, డ్రెస్సింగ్ టేబుల్లోని విలువైన వస్తువులను చోరీ చేశారు. నాలుగు తులాల పుస్తెలతాడు, ఉంగరాలు చోరీకి గురైనట్లు పెద్దకూతురు మౌనిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. క్లూస్టీం సభ్యులు ఫింగర్ఫ్రింట్స్ ఆధారాలు సేకరిస్తున్నారు.
దొంగతనంపై కేసు
ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ర మాకాంత్ తెలిపిన వివరాలు.. మండలకేంద్రానికి చెందిన మద్దుల శ్రీపాల్రెడ్డి ఇంట్లో కొంతకాలంగా లక్ష్మణాచారి కుటుంబం అద్దెకు ఉంటున్నారు. పని నిమిత్తం వారు ఇంటికి తాళం వేసి హైదరాబాద్కు వెళ్లారు. ఈనెల 3న గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. లక్ష్మణా చారికి శ్రీపాల్రెడ్డి సమాచారం ఇవ్వగా వారు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరి పిన పోలీసులు మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యాయత్నం
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో సోమవారం కూర శ్రీనివాస్రెడ్డి(40) అనే రైతు అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. శ్రీనివాస్రెడ్డి వ్యవసాయంతోపాటు హార్వెస్టర్ నడిపిస్తాడు. నెలరోజుల క్రితం ఆకస్మాత్తుగా కిందపడటంతో అనారోగ్యానికి గురయ్యాడు. ఆపరేషన్ చేసేందుకు రూ.2లక్షలు అవసరం కాగా భూమిని విక్రయించేందుకు సిద్ధపడగా వీలుకా లేదు. ఈ క్రమంలో సోమవారం గడ్డిమందు తాగిన శ్రీనివాస్రెడ్డిని కుటుంబసభ్యులు చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు.

ప్రజాస్వామ్యబద్ధంగా మున్నూరుకాపు సంఘం ఎన్నికలు