
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
ముస్తాబాద్: మండలంలోని సేవాలాల్తండాలో సేవాలాల్ మహారాజ్, జగదాంబదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం హోమం నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో ఆలయానికి తరలివెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ సర్పంచులు మంగ్యానాయక్, శ్రీనివాస్ నాయక్, వైద్యాధికారి చందర్నాయక్, బంజార సంఘం మండల అధ్యక్షుడు లకావత్ నర్సింలు, మున్యా, ముడావత్ నాగరాజు, పంతులు నాయక్, రమేశ్, సంతోష్, రవి తదితరులు పాల్గొన్నారు.
మంగళ హారతులు, బోనాలతో సంప్రదాయ దుస్తుల్లో గిరిజన మహిళలు