
మా బడిలో చేర్పించండి
● ఎంఈవో వినూత్న ప్రచారం
కరీంనగర్: ‘మా బడిలో మంచి తరగతి గదులున్నాయి. ప్రయోగాలు చేసేందుకు సైన్స్ల్యాబ్, లైబ్రరీ, ఆత్మరక్షణకు కరాటే, ఆరోగ్యానికి పౌష్ఠికాహారం అందిస్తున్నాం. మీ పిల్లలను మా బడిలో చేర్పించండి’ అంటూ కరీంనగర్ జిల్లా గంగాధర ఎంఈవో ప్రభాకర్రావు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరా లంటూ మండలంలో ప్రచారం చేస్తున్నారు. బడిబాటకు ముందు సొంతంగా విద్యావాహిని పేరిట వాహనాన్ని తయారు చేశారు. ఆ వాహనానికి బడిలో కల్పిస్తున్న వసతుల ఫొటోలు అంటించి, తల్లిదండ్రులకు ఆవగాహన కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను వెంటేసుకుని రోజుకో గ్రామం తిరుగుతూ బడిబాటను కొనసాగిస్తున్నారు. మండలంలోని 33 గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రభాకర్రావు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి స్ఫూర్తితో సొంతఖర్చులతో వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభాకర్రావు గతంలోనూ జిల్లా, రాష్ట్ర, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు.