ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష

May 3 2025 11:24 AM | Updated on May 3 2025 11:24 AM

ఇంటర్

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష

కరీంనగర్‌: నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలను ఇంటర్‌ బోర్డు జాయింట్‌ సెక్రటరీ వసుంధరదేవి శుక్రవారం సందర్శించారు. ఇటీవల విడుదల చేసిన ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్షించారు. కళాశాల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి, తగు సూచనలు చేశారు. బాలికల పునఃచ్చరణ తరగతులను పరిశీలించి, తగు మార్గదర్శకాలు అందించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. తానూ ఇదే కళాశాలలో చదివిన ట్లు గుర్తు చేశారు. కళాశాలను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఈవో వి.గంగాధర్‌, ప్రిన్సిపాల్‌ ఎ.నిర్మల,, డాక్టర్‌ జి. వెంకటరాజిరెడ్డి, నిత్య, కరుణ, మమత, ఉమాదేవి, సూపరింటెండెంట్‌ బల్బీర్‌సింగ్‌ పాల్గొన్నారు.

‘ఉగ్రదాడికి కేంద్రం వైఫల్యమే కారణం’

చిగురుమామిడి: ఇటీవల జరిగిన ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, అందుకు ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్‌షా నైతిక బాధ్యత వహించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. చిగురుమామిడిలోని ముస్కు రాజిరెడ్డి స్మారక భవనంలో శుక్రవారం సీపీఐ 19వ మండల మహాసభ నిర్వహించారు. అందె చిన్నస్వామి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చాడ వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తోందని, పేద ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. రాష్ట్రంలో సీపీఐ సహకారంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పోనుగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె స్వామి, బోయిని అశోక్‌, గూడెం లక్ష్మి, జిల్లా ౖకౌన్సిల్‌ సభ్యులు చాడ శ్రీధర్‌రెడ్డి, బోయి ని పటేల్‌, కాంతాల శ్రీనివాస్‌రెడ్డి, బూడిద సదాశివ, ముద్రకోల రాజయ్య పాల్గొన్నారు.

గోడ ప్రతుల ఆవిష్కరణ

కొత్తపల్లి: చింతకుంటలోని శ్రీ సీతారామ భక్త హనుమాన్‌ సహిత ఆలయంలో ఈనెల11వ తేదీన చేపట్టనున్న 108సార్లు హనుమాన్‌ చాలీసా పారాయణ కార్యక్రమ గోడ ప్రతులను కరీంనగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌ ఆవిష్కరించారు. చాలీ సా పారాయణ బృంద సభ్యుడు పెరుమాండ్ల కమల్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌, కరీంనగర్‌ ఫ్యాక్స్‌ చైర్మన్‌ పి.శ్యాంసుందర్‌ రెడ్డి, రెడ్డవేని మధు, జింక సంపత్‌, నాయిని ప్రసాద్‌, శేఖర్‌ రావు పాల్గొన్నారు.

జమ్మికుంటకు రూ.3 కోట్ల నిధులు

జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ గత ఆర్థిక సంవత్సరంలో వందశాతం పన్నులు వసూలు చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలి చింది. దీంతో జమ్మికుంట పట్టణ అభివృద్ధికి రూ.3కోట్లు మంజూరు చేస్తూ.. మున్సిపల్‌ సెక్రటరీ టీకే.శ్రీదేవి మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ.అయాజ్‌కు హైదరాబాద్‌లో ప్రొసీడింగ్స్‌ అందించారు. పన్నుల వసూళ్లలో కష్టపడి పని చేసిన కమిషనర్‌, సిబ్బందిని అభినందించారు. కమిషనర్‌ ఎండీ.అయాజ్‌ మాట్లాడుతూ రూ.3 కోట్ల నిధులను పట్టణంలో జంక్షన్లు, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని తెలిపారు. మేనేజర్‌ రాజిరెడ్డి, ఆర్‌ఐ భాస్కర్‌, ఆర్‌వో వాణి, మున్సి పల్‌ అధికారులు మహేశ్‌, కుమార్‌, బిల్‌ కలెక్టర్‌ మొగిలయ్య, పాషా పాల్గొన్నారు.

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష1
1/3

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష2
2/3

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష3
3/3

ఇంటర్‌ ఫలితాలపై పునః సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement