
ప్రాణం తీసిన చేపల వేట
● భార్య కళ్ల ముందే నీటమునిగిన భర్త
శంకరపట్నం: చేపల వేటకు కుంటలో దిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని మెట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొల్లూరి చంద్రమౌళి((60)) భార్య స్వరూపతో కలిసి శుక్రవారం సాయంత్రం చింతకుంటలో చేపల వేటకు వెళ్లాడు. భార్య, భర్త ఇద్దరు చీరతో చేపలు పడుతుండగా చంత్రమౌళి కుంటలోని జేసీబీ గుంతలో పడిపోయాడు. భార్య స్వరూప బయటకు తీసేందుకు ప్రయత్నించగా నీట మునిగాడు. సమీపంలోనివారు చంద్రమౌళిని ఒడ్డుకు తీశారు. ఎస్సై రవి, ట్రైనీ ఎస్సై సుమన్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య స్వరూప, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.