
బీజేపీకి గుణపాఠం తప్పదు
కరీంనగర్: కార్మికులు తమ హక్కులను పోరాడి సాధించుకున్నారని, బీజేపీ వారి హక్కులను హరిస్తే కార్మిక లోకం చూస్తూ ఊరుకోదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రైల్వే హమాలీ సంఘం కార్మికులు ఏర్పాటుచేసిన పతాకాన్ని ఆవిష్కరించారు. రైల్వేగేట్ నుంచి బద్దం ఎల్లారెడ్డి భవన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య జెండా ఆవిష్కరణ చేశారు. సిమెంట్ గోదాం, ఫర్టిలైజర్ హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం చాడవెంకటరెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11ఏళ్లు గడుస్తున్నప్పటికీ కార్మిక హక్కులను హరించడానికి కుటీల ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోని కార్మికవర్గం అంతా మేడే స్ఫూర్తిగా హక్కుల కోసం పోరాటం చేయాలని, ఈనెల 20న జాతీయ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ అనుబంధ రైల్వే హమాలీ సంఘం అధ్యక్షుడు కాశెట్టి లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి ప్రభాకర్, రవీందర్, బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్దండి దామోదర్, ఉల్లిగడ్డల హమాలీ సంఘం అధ్యక్షుడు నర్సింహులు, కొమురయ్య, సిమెంట్ గోదాం ఫర్టిలైజర్ హమాలీ సంఘం అధ్యక్షుడు జంగా తిరుపతి, నన్నవేన కొమురయ్య, కదారి బీరయ్య, మామిడిపెల్లి శంకర్, ఆకుల లచ్చన్న, ప్రకాశం గంజ్ ట్రాలీ ఆటో యూనియన్ నాయకులు ప్రభాకర్ ,కాల్వ రాయమల్లు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి