
పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదు
లింగంపేట: పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రాంబాయి తెలిపారు. దీంతో శనివారం తండాలో వైద్య శిబిరం నిర్వహించి, తండావాసులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందించారు. ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. తండాలో పిచ్చిమొక్కలు, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. డెంగీ బాధితురాలికి లింగంపేట ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో వైద్య చికిత్సలు అందిస్తున్న ట్లు వైద్యురాలు తెలిపారు. వైద్య శిబిరంలో ఎంపీవో మలహరి, కార్యదర్శి రాజ్యలక్ష్మి, వైద్య సిబ్బంది యాదగిరి, ఫరీదా, రాధిక, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
‘విద్యుత్ సమస్యలుంటే తెలపండి’
కామారెడ్డి టౌన్ : జిల్లాలో పంట పొలాల ప రిధిలో విద్యుత్ సమస్యలపై రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ శనివా రం ఒక ప్రకటనలో సూచించారు. వదులు గా, తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు తక్కువ ఎత్తులో ఉ న్నా, స్తంభాలు వంగిపోయినా తక్షణమే సె క్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్, గ్రామ స్థాయిలో ఉండే లైన్మన్లకు తెలియజేయాలని కోరారు. భారీ వర్షాలు, గాలి దు మారాల వల్ల విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే స్థానిక ఏఈలకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటిలోకి వచ్చే స ర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల మీదుగా వెళ్లకుండ చూసూకోవాలని పేర్కొన్నారు. రెతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రత ప్రమాణాలు పాటించాలని, ఏ సమస్య తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఎలుగుబంట్ల సంచారంతో
గాలింపు చర్యలు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం సోమరేగడి తండా శివారులో ఎలుగుబంట్లు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులోని పొలాల వద్ద రెండు ఎలుగుబంటి పిల్లలు తరచూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎలుగుబంట్లు కనిపించలేదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామ శివారులో బోన్లను ఏర్పాటు చేసి ఎలుగుబంట్లను పట్టుకోవాలని గ్రామస్తులు కోరారు.
‘అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి’
భిక్కనూరు: యువత దేశం గర్వించేలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. శనివారం భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, మొబైల్ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, ఎన్వైకే ఉమ్మడి జిల్లా అధికారి శైలి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు అంజయ్య, హరిత, అధ్యాపకులు రాజేశ్వరి, లలిత, సబిత, మోహన్బాబు, యాలాద్రి, నరసయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదు

పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదు