
రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ట్రయథ్లాన్ అండర్–14, 12, 10 బాలబాలికలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో 250 మందికిపైగా ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 19 మందిని ఆయా అంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు. వీరు వచ్చేనెల 6న హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలలో పాల్గొననున్నారు.
ఎంపికై ంది వీరే..
డి.యోగి, ఎన్.శాన్విత్రెడ్డి, బి.శ్రీవల్లిక, జె.ఈశ్వర్, పి.అశ్విని, ఎ.అర్చన, ఎం.రాణాప్రతాప్, సీహెచ్.నిహారిక, ఎన్.దేవీదాస్, ఎం.కృష్ణమూర్తి, ఎం.రాంచరణ్, ఎన్.పండరి, ఎస్కె.జోయ, డి.గీతమ్, కె.సింధు, వి.శ్రీగణేష్, కె.కార్తికేయ, డి.విహాన్రెడ్డి, డి.ధనశ్రీ.