
కాలేజీల అభివృద్ధికి నిధులు
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా 16 జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లు మంజూరయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన బీబీపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బీర్కూర్ కళాశాలలకు మాత్రం నిధులు మంజూరు కాలేదు. మంజూరైన నిధులతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్, నీటి సరఫరా, ప్లంబింగ్ తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాకు ఈ స్థాయిలో నిధులు మంజూరవడం ఇదే తొలిసారి. ఈ నిధులతో పంచాయతీరాజ్ శాఖతో పనులు చేయించనున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
జిల్లాలోని జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. వీటితో అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తాం. నెలరోజుల్లో పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం.
– షేక్ సలాం, ఇంటర్మీడియట్ జిల్లా
నోడల్ అధికారి, కామారెడ్డి
కళాశాలల వారీగా నిధుల వివరాలు.. (రూ. లక్షలలో)
కళాశాల మంజూరైన
నిధులు
బిచ్కుంద 43.00
మద్నూర్ 36.50
ఎల్లారెడ్డి 27.00
గాంధారి 22.00
మాచారెడ్డి 22.00
జుక్కల్ 21.00
పిట్లం 21.00
దోమకొండ 21.00
భిక్కనూరు 20.00
లింగంపేట 18.00
సదాశివనగర్ 16.00
బాన్సువాడ 16.50
(బాయ్స్)
కామారెడ్డి 15.00
తాడ్వాయి 10.50
రామారెడ్డి 13.00
బాన్సువాడ 06.00
గర్ల్స్
మౌలిక వసతులు, మరమ్మతుల కోసం..
జిల్లాకు రూ. 3.28 కోట్లు మంజూరు

కాలేజీల అభివృద్ధికి నిధులు