
ఆదర్శం ఫరీదుపేట పూర్వ విద్యార్థులు
మాచారెడ్డి : చదువుకున్న బడి బాగు కోసం ఫరీదుపేట పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. పల్వంచ మండలం ఫరీదుపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రెరా చైర్మన్, కామారెడ్డి తొలి కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ గ్రామస్తులు బాధ్యతగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు, మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానం రూపొందించాలని విద్య కమిషన్ను ఆదేశించామన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాతగా పేరున్న తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ఫరీదుపేట పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మరికొందరు తమకు తోచిన సాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పూర్వ విద్యార్థులు రమేశ్గౌడ్, డాక్టర్ శంకర్, కొంగల వెంకటి, సిద్దరాంరెడ్డి, భోజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అపూర్వ కలయిక
1962 నుంచి ఇప్పటివరకు ఫరీదుపేటలో చదువుకున్నవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో రోజంతా సరదాగా గడిపారు. తమకు విద్యాబోధన చే సిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఫరీదుపేట గ్రామం జాతరను మరిపించింది. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి తామంతా ప్రయత్నిస్తామని పలువురు పేర్కొన్నారు.
విద్యారంగ అభివృద్ధికి చర్యలు
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ