అగ్రస్థానమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అగ్రస్థానమే లక్ష్యం

Jun 3 2025 5:35 AM | Updated on Jun 3 2025 5:35 AM

అగ్రస

అగ్రస్థానమే లక్ష్యం

పరిష్కారం లభించేనా?

వాతావరణం

ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది.

మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2025

రేపటినుంచి

డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

బాన్సువాడ రూరల్‌: డిగ్రీ ఫస్టియర్‌ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలను బుధవారంనుంచి నిర్వహించనున్నట్లు బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్‌) ప్రిన్సిపల్‌ వేణుగోపాలస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి మొదటి సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.

ప్రాక్టికల్స్‌ సెంటర్‌ పరిశీలన

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ సెంటర్‌ను సోమవారం ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి 6వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు.

నేడు యోగా వాక్‌

కామారెడ్డి అర్బన్‌: అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం యోగా వాక్‌ నిర్వహించనున్నట్లు ఆయుష్‌ డీపీఎం ఆకుల శ్రీకాంత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం వద్ద యోగా నడక ప్రారంభమవుతుందని, స్టేషన్‌ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్‌ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు యోగా వాక్‌లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఎమ్మెల్యే క్యాంపు

కార్యాలయంలో డీఎస్‌పీ ఆఫీస్‌

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీఎస్పీ ఆఫీస్‌ను మార్చారు. ఇన్నాళ్లు డీఎస్పీ కార్యాలయం ప్రైవేటు బిల్డింగ్‌లో కొనసాగుతూ వచ్చింది. నూతన కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ రవీందర్‌నాయక్‌, ఎస్సై మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధికి

ప్రజలు సహకరించాలి

కామారెడ్డి టౌన్‌: పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో ప్రారంభో త్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం 100 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్‌, ఏఈ శంకర్‌, ఆర్‌వో రవిగోపాల్‌, టీపీవో గిరిధర్‌, సానిటరీ ఎస్సైలు నగేష్‌, పర్వేజ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వెల్లుట్లపేటలో ఘనంగా రాజరాజేశ్వర విగ్రహ ప్రతిష్ఠ

ఎల్లారెడ్డిరూరల్‌: వెల్లుట్లపేట గ్రామ శివారు లోని చెనింగ రాజరాజేశ్వరాలయంలో శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవా రం ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో మూడు రోజులుగా ఉత్సవాలు సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా గణపతి, శివుడు, పార్వతిమాత, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు, నంది, నాగరాజుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కా ర్యక్రమంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పాల్గొన్నారు. భక్తులు సన్మార్గంలో నడవాలని సూచించారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీజీటీడీసీ) చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌజింగ్‌బోర్డు వద్ద ఉన్న తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పటేల్‌ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. కామారెడ్డిని నేరరహిత జిల్లాగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను ఆయన తన ప్రసంగంలో ఏకరువు పెట్టారు. ఆ వివరాలు..

● జిల్లాలో ఇందిర మహిళా శక్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.169.29 కోట్లతో 12,905 యూనిట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.76 కోట్లతో 149 యూనిట్లను మంజూరు చేశాం. వాటి ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు.

● రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాలుగు రైతు వేదికలలో దృశ్య శ్రవణ సౌకర్యాన్ని కల్పించి 53 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం.

● జిల్లాలో అకాల వర్షాలతో 493 మంది రైతులకు సంబంధించిన 480 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.48 లక్షలు బాధిత రైతుల ఖాతాల్లో జమ చేశాం.

● 1,01,535 మంది రైతులకు సంబంధించి రూ.733.22 కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం.

● జిల్లాలో 1,072 మంది రైతులు చనిపోగా 693 మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.34.65 కోట్లు జమ చేశాం.

● 11,153 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,894 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 144 ఇళ్లు బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు పూర్తి కావడంతో లబ్ధిదారులకు రూ.1.09 కోట్లు చెల్లించాం.

● అమృత్‌–2 పథకంలో భాగంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో రూ.180 కోట్లతో చేపట్టిన నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి.

● జిల్లాలో 2,56,732 రేషన్‌కార్డులకు ఏప్రిల్‌లో 5,571 మెట్రిక్‌ టన్నులు, మేలో 5,787 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేశాం. జూన్‌, జూలై, ఆగస్టు మాసాలకుగాను 17,711 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తాం.

● రూ.500 లకు గ్యాస్‌ సిలిండర్‌ పథకం కింద జిల్లాలో 1,50,131 మందికి 5,58,981 సిలిండర్లను పంపిణీ చేశాం. దీనికి రూ.16.05 కోట్లు ఖర్చు చేశాం.

● ఆర్టీసీలో కల్పించిన ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ. 137 కోట్ల మేర ప్రయోజనం కలిగింది.

● జిల్లాలో 3,889 మందికి రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. అలాగే రేషన్‌ కార్డులలో 45,344 మంది కుటుంబ సభ్యుల పేర్లు యాడ్‌ అయ్యాయి.

● చేయూత పథకం ద్వారా జిల్లాలో 1.62 లక్షల మందికి ప్రతినెలా రూ.36.22 కోట్లు అందిస్తున్నాం.

● గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 1,57,656 కుటుంబాలకు 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం రూ.5.68 కోట్లు ఖర్చు చేస్తోంది.

● జిల్లాలో ఏడాది కాలంలో 17,611 మంది నిరుపేదలకు శస్త్ర చికిత్సలు, చికిత్సల గురించి రూ.42 కోట్లు ఆరోగ్య శ్రీ ద్వారా ఖర్చు చేశాం.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..

ఉత్సవాలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. వారికి జ్ఞాపికలు అందించి అభినందించారు. అభివృద్ధిపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ ఆహూతులు సందర్శించారు. ఉత్సవాలలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్ర, అడిషనల్‌ కలెక్టర్లు చందర్‌నాయక్‌, విక్టర్‌, డీఎఫ్‌వో నిఖిత, ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రకాంత్‌రెడ్డి, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.

భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తెచ్చాం. పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో లింగంపేట మండలాన్ని ఎంపిక చేశాం. 23 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 4,225 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నాం.

మాట్లాడుతున్న పటేల్‌ రమేశ్‌రెడ్డి

డ్రోన్‌ పనితీరును ఆసక్తిగా తిలకిస్తున్న అతిథులు

● యాసంగిలో 3.72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనగోలు చేసి రూ.800.71 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. మహిళలకు ఎక్కువ కేంద్రాలను కేటాయించడం ద్వారా వారు రూ.3.20 కోట్లు లబ్ధిపొందారు. 27,795 మంది రైతుల నుంచి 1.79 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న రకం వడ్లను కొనుగోలు చేశాం. వాటికి రూ.83 కోట్లను బోనస్‌గా చెల్లిస్తాం. యాసంగి సీజన్‌లో 2.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.216 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశాం. 24 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 30,202 మెట్రిక్‌ టన్నుల జొన్నలను కొనుగోలు చేశాం. రైతులకు రూ.102 కోట్లు చెల్లించాం. 653 మెట్రిక్‌ టన్నుల పొద్దు తిరుగుడు విత్తనాలను కొనుగోలు చేసి రూ.5 కోట్లను రైతులకు చెల్లించాం. ఖరీఫ్‌ సీజన్‌లో 5,067 మంది రైతుల నుంచి లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రూ.74 కోట్లు చెల్లించాం.

‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’..

కామారెడ్డి క్రైం: ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 8 మంది రైతులకు విత్తన కిట్‌ (విత్తనాల బస్తా)లను అందించారు. విత్తు కొద్దీ పంట అనే నానుడిని నిజం చేస్తూ ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని డీఏవో తిరుమల ప్రసాద్‌ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 25 మండలాల పరిధిలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన వరి, పెసర విత్తనాలు అందజేస్తామన్నారు. రైతులు ఈ విత్తనాలతో సాగు చేసి, పండిన పంటను ఇతర రైతులకు విత్తనాలుగా అందించడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. విత్తన లభ్యతను పెంచడమే కాకుండా నాణ్యమైన విత్తనంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మండలానికి ఒక శాస్త్రవేత్తను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్‌ అధికారి, శాస్త్రవేత్త ఏనుగు అనిల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

భూభారతి అమలుకోసం ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించింది. అందులో లింగంపేట మండలం ఒకటి. అధికారులు సదస్సులు నిర్వహించి భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. లింగంపేట మండలంలో మొత్తం 4,225 ఫిర్యాదులు రాగా దాదాపు వెయ్యి సమస్యలను అధికారులు పరిష్కరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. దీని బట్టి చూస్తే చిన్నచిన్న సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరికే అవకాశాలున్నాయి. సర్వేలు, నివేదికలు తయారు చేయాల్సిన వాటి విషయంలో కాస్త ఆలస్యం జరగవచ్చు. హైకోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి సాదాబైనామాలను ఇప్పట్లో పరిష్కరించే అవకాశం లేదు. వాటితో పాటు కోర్టులో ఉన్న కేసులు మినహా మిగతా భూసమస్యలకు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం దొరుకుంతుందని ఆశిస్తున్నారు.

పైలట్‌ ప్రాజెక్టు అనుభవంతో..

లింగంపేట మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో సదస్సుల నిర్వహణలో జిల్లా యంత్రాగానికి మంచి అనుభవం వచ్చింది. రైతుల నుంచి ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, సమస్యల పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలి తదితర అంశాలపై జిల్లా అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. లింగంపేట మండలంలో ఎదురైన అనుభవాలతో జిల్లాలోని మిగతా మండలాల అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు.

బృందాల ఏర్పాటు..

జిల్లాలో లింగంపేట మినహా మిగిలిన అన్ని మండలాల్లో బుధవారం నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి మండలానికి అక్కడి పరిస్థితులు, అవసరాలను బట్టి అధికారులను సర్దుబాటు చేస్తూ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌లు ఆయా బృందాలకు బాధ్యులుగా ఉంటారు. వారు ప్రణాళిక ప్రకారం కేటాయించిన తేదీల్లో గ్రామాలకు చేరుకుని సదస్సులు నిర్వహిస్తారు. స్థానికంగా ఉండే రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారు. పట్టా పాస్‌ పుస్తకాలు, రికార్డుల్లో తప్పులు, సర్వే నంబర్‌లు, విస్తీర్ణంలో తప్పులు, అటవీ, రెవెన్యూ భూమి సరిహద్దుల వివాదాలు, వారసత్వ హక్కులు, పట్టా మార్పిడులు, రికార్డుల్లో నమోదు కాని భూములు తదితర అన్ని రకాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదులపై విచారణకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. వీలయినంత త్వరగా, పారదర్శకంగా భూ సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ సదస్సుల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను ఇప్పటికే ఆయా మండలాల్లో పర్యటించాల్సిన బృందాల ఎంపిక, గ్రామాల వారీగా ప్రణాళిక పూర్తి చేశారు.

న్యూస్‌రీల్‌

తెలంగాణ రైజింగ్‌–2047 విజన్‌తో ముందుకు వెళ్తున్నాం

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

టీజీటీడీసీ చైర్మన్‌ పటేల్‌ రమేశ్‌రెడ్డి

జిల్లా కేంద్రంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

నేటి నుంచి రెవెన్యూ సదస్సులు

అన్ని గ్రామాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

భూ సమస్యలపై రైతులనుంచి దరఖాస్తులు

స్వీకరించనున్న అధికారులు

కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగం

భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలుకోసం అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి సర్కారు సిద్ధమయ్యింది. అధికారులు మంగళవారంనుంచి ఈనెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈసారైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని బాధిత రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. – కామారెడ్డి క్రైం

ఏర్పాట్లు పూర్తయ్యాయి

అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. సదస్సులను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికా బద్ధంగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తాం.

– మస్రూర్‌ అహ్మద్‌, ఏవో, కామారెడ్డి కలెక్టరేట్‌

అగ్రస్థానమే లక్ష్యం1
1/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం2
2/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం3
3/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం4
4/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం5
5/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం6
6/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం7
7/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం8
8/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం9
9/10

అగ్రస్థానమే లక్ష్యం

అగ్రస్థానమే లక్ష్యం10
10/10

అగ్రస్థానమే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement