బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

Jun 6 2025 6:17 AM | Updated on Jun 6 2025 6:17 AM

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

బక్రీద్‌ను ప్రశాంతంగా జరుపుకోవాలి

కామారెడ్డి క్రైం: బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహించారు. రైల్వే స్టేషన్‌ వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా నిజాంసాగర్‌ చౌరస్తా వరకు సాగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పెట్రోలింగ్‌, భద్రతా ఏర్పాట్లు, జాగ్రత్తలను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడం కోసమే ఫుట్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. పండుగలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సైలు, 170 మంది సివిల్‌, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

పట్టణంలో ఫుట్‌ పెట్రోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement