
మోదీ పాలనలో భారత్ అభివృద్ధి
కామారెడ్డి టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధించిందని బీజేపీ మహి ళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి పేర్కొన్నా రు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంకల్ప సహ కారం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అత్యంత పటిష్టంగా మారిందన్నారు. అన్ని దేశాలతో భారత్ సత్సంబంధాలు కలిగి ఉండటమే కా కుండా బలమైన మిత్ర పక్షంగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, నరేందర్రెడ్డి, రవీందర్రావు, రాము, లక్ష్మారెడ్డి, లింగారావు, వేణు, సంతో ష్రెడ్డి, బాల్రాజు, అనిత, సంధ్య పాల్గొన్నారు.