
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
కామారెడ్డి టౌన్: మానవ అక్రమ రవాణాను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈవో రాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కేజీబీవీలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఉపాధ్యా యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తోందన్నారు. ఇది నేరపూరితమైన చర్య అని పేర్కొన్నారు. సోషల్ మీడియాను అతిగా వినియోగించవద్దని సూచించారు. మానవ అక్రమ రవా ణాను ఆదిలోనే అడ్డుకుంటే ఆడపిల్లలను రక్షించుకోవచ్చని స్వచ్ఛంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామకృష్ణ పేర్కొన్నా రు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, కేజీబీవీ, మాడల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దేవాలయాల అభివృద్ధికి
కృషి చేస్తా
కామారెడ్డి టౌన్: నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి యంత్రమూర్తి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే నియోజకవర్గంలో చాలా వరకు ఆలయాలను అభివృద్ధి చేశామన్నా రు. తాను ముస్లింను అయినా శివుడు ఆల యాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనను ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు.
నేడు విద్యుత్
సమస్యలపై సదస్సు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సబ్స్టేషన్లో శుక్రవారం లోకల్ సదస్సు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ కల్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు తమ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావాలని సూచించారు.
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద 3, 5, 8 తరగతులలో ప్రవేశాలకు అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు ఫారాలను ఈనెల 9 నుంచి 17 వరకు కలెక్టరేట్లోని 208 నంబర్ గదిలోగల గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పొంది, పూర్తి వివరాలతో అందజేయాలని సూ చించారు. 20న కలెక్టర్ సమక్షంలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు.
ముగిసిన డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. చివరి రోజు యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 18 పరీక్ష కేంద్రాలలో 325 మంది విద్యార్థులకుగానూ 13 మంది గైర్హా జరయ్యారన్నారు. పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు వివిధ ప రీక్ష కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడు తూ మొత్తం 16 మంది డిబార్ అయ్యారన్నారు.
పెరుగుతున్న నీటి మట్టం
బాల్కొండ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1,062.30 (12.9 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.

మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి