
ఏ నేల.. ఏ పంటకు అనుకూలం?
రాజంపేట: భూసారాన్ని తెలుసుకోవడంతోపాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పంట దిగుబడులను పెంచేందుకు చేపట్టాల్సిన భూసార పరీక్షలు నాలుగేళ్లుగా జిల్లాలో చేపట్టడం లేదు. రైతులు స్వల్ప పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతుండడంతోపాటు నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నాయి. ఇందులో ఎంతోకీలకమైన భూసార పరీక్షలు మాత్రం చేపట్టడం లేదు. మండలాల వ్యవసాయాధికారులకు కిట్లను అందజేసినా నాలుగేళ్లుగా భూసార పరీక్షల జాడలేకపోవడం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగ వుతాయి. కేవలం రాజంపేట మండలంలోనే 9 వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో పంటలు సాగవుతా యి. గతంలో వేసవిలో భూసార పరీక్షలు ఏఈవోల ద్వారా చేసేవారు. ఆ ఫలితాలకు అనుగుణంగా రైతులు పంటల సాగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే నాలుగేళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో రైతు లు ఇష్టారీతిన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడు తోంది. గతంలో ఏటా నీటి లభ్యత ఉన్న ప్రాంతా ల్లో పదెకరాలకు ఒక మట్టి నమూనా, వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేసి నేల పరిస్థితులపై రైతు లకు అవగాహన కల్పించేవారు. తదనుగుణంగా రైతులు ఎరువులను వాడేవారు. నాలుగేళ్లుగా భూసార పరీక్షల కార్యాచరణను రూపొందించడం లేదు.
బడ్జెట్ లేక ఆలస్యం
గత నాలుగు సంవత్సరాలుగా భూసార పరీక్షలు నిర్వహించడం లేదు. బడ్జెట్ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే భూసార పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం
– శృతి, ఏవో రాజంపేట
మూలకు చేరిన పరికరాలు
ప్రభుత్వం 2018లో భూసార పరీక్షలను ప్రారంభించగా 2020 వరకు సజావుగా సాగాయి. ఇందుకోసం రూ.1.30 లక్షల విలువైన ఒక్కో కిట్టును ఏఈవోలకు అందించారు. అప్పట్లో రైతు వేదికలు లేకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచారు. రైతు వేదికలను నిర్మించిన తరువాత వాటిని అందులోకి మార్చినప్పటికీ మూలకు చేరాయి. 2020 వరకు ఈ పరీక్షలు సజావుగా సాగాయి.
జిల్లాలో నాలుగేళ్లుగా భూసార పరీక్షలకు బ్రేక్
ఇష్టారీతిన ఎరువులు
వినియోగిస్తున్న రైతులు
తగ్గుతున్న భూసారం.. పంట దిగుబడి