
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
డిచ్పల్లి: డిచ్పల్లి బస్టాండ్ వద్ద సోమవారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు, కారును ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు (నబరు టీజీ 16 టీ 2156) డిచ్పల్లి బస్టాండ్లో నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తోంది. అదే సమయంలో నాగ్పూర్ గేట్ వైపు నుంచి నిజామాబాద్ వెళుతున్న కారు (నంబర్ టీఎస్ 18 హెచ్ 6831)ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా తిరగడంతో కారు, బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుకు అడ్డుగా రెండు వాహనాలు నిలిచిపోయేసరికి కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు, ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.