
కాంగ్రెస్ పార్టీ నుంచి కందూరి లింబాద్రి సస్పెండ్
రామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ కబ్జాలతో పాటు, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కందూరి పెద్ద లింబాద్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, ఇర్పాన్, రంజిత్, భాస్కర్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.