
డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన బైకు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలో జరుగుతున్న 765డీ రోడ్డు పనులలో అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం కుర్లం నుంచి నెమ్లి వైపు వెళ్తుండగా మండలకేంద్రంలో ద్విచక్ర వాహనం డ్రెయినేజీలోకి దూసుకుపోయింది. ఈప్రమాదంలో బైక్పై ఉన్న కుర్లం గ్రామానికి చెందిన శ్రీను, భీమయ్య, సంజీవ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్సులో బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, సోమవారం రాత్రి కారు అదుపు తప్పి డ్రెయినేజీ కోసం తవ్విన గుంతలో పడింది. రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థుల నమోదు పెరగాలి
కామారెడ్డి టౌన్: వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నమోదు పెరిగేలా బడిబాట కార్యక్రమం ప్రణాళికతో నిర్వహించాలని డీఈవో ఎస్.రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభ్యసనాభివృద్ధి పెరగడానికి వేసవిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్పీల నియామకాల కోసం మండల, జిల్లా స్థాయిలో ఆర్పీల ప్రతిపాదనలు పంపాలన్నారు. మే 1 నుంచి 15వ తేది వరకు మండల స్థాయిలో సమ్మర్ క్యాంపులు నిర్వహించాలన్నారు. బాలిక శ్రేయస్సు దృష్ట్యా ప్రతి స్కూల్లో జీఈసీఈ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. పోక్సో చట్టంపై ప్రతి ఉపాధ్యాయుడు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి డీఈవో అశోక్, సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగేందర్, రమణరావు, కృష్ణచైతన్య, పరీక్షల విభాగం కమిషనర్ బలరాం, డీసీఈబీ కార్యదర్శి నీల లింగం, ఎంఈవోలు, నోడల్ అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

డ్రెయినేజీలోకి దూసుకెళ్లిన బైకు