
రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: రైతులకు అసౌకర్యం కలుగకుండా ధాన్యం కొనుగోళ్లు జరగాలని రాష్ట్ర నోడల్ అధికారి ఫణీంద్ర రెడ్డి సూచించారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూర్తో పాటు మండలంలోని జంగంపల్లి అంతంపల్లి, కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ నమోదు చేసి రైతులకు 72 గంటల్లోగా నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్ర నోడల్ అధికారి ఫణీంద్ర రెడ్డి