దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు

Jun 12 2025 3:13 AM | Updated on Jun 12 2025 3:13 AM

దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు

దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు

కాకినాడ సిటీ: దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు. కాకినాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలో దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. పింఛన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్‌కుమార్‌ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప, ముమ్మిడివరం మండలాల్లో మానసిక మహిళ దివ్యాంగులపై అత్యాచార ఘటన జరపడం దురదృష్టకరమన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని, 35 కేజీల బియ్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నామినేటెడ్‌ పదవుల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంఘ జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్‌, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement