రత్నగిరిపై భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై భక్తుల రద్దీ

Jun 10 2025 6:59 AM | Updated on Jun 10 2025 6:59 AM

రత్నగ

రత్నగిరిపై భక్తుల రద్దీ

అన్నవరం: రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివాహాల సీజన్‌ కావడంతో ప్రతి రోజూ ఆలయంలో నవదంపతుల సందడి కనిపిస్తోంది. సోమవారం సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు నిర్వహించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అమ్మవారు ఏ విధమైన ఆభరణాలూ లేకుండా ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు.

సత్యదేవుని సన్నిధిలో

జస్టిస్‌ మాల

అన్నవరం: మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.మాల తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సత్యదేవుని దర్శించారు. రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వారికి పండితులు వేదాశీస్సులు, ఈఓ వీర్ల సుబ్బారావు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

ద్రాక్షారామ భీమేశ్వరునికి

వెండి శంఖం బహూకరణ

రామచంద్రపురం రూరల్‌: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామికి హైదరాబాద్‌కు చెందిన తంగిరాల రవికిరణ్‌, నాగలక్ష్మీ శైలజ దంపతులు 328 గ్రాముల బరువు గల వెండి శంఖాన్ని సోమవారం సమర్పించారు. హైదరాబాద్‌కే చెందిన అనుమోలు దేవా, కుటుంబ సభ్యులు ఆలయ చండీ హోమ పండితుడు జుత్తిక చిన్నా ప్రోత్సాహంతో ఆలయానికి 8 కూలర్లు అందజేశారు. దాతలకు స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికలను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని అందజేశారు.

నెలాఖరుకు పోలవరం

ఎడమ కాలువ పనులు

ధవళేశ్వరం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్‌ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తితో కలిసి ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ధవళేశ్వరం కాటన్‌ గెస్ట్‌ హౌస్‌లో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో వచ్చే వారంలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

రత్నగిరిపై భక్తుల రద్దీ 1
1/1

రత్నగిరిపై భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement