
దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి
కాకినాడ క్రైం: వర్తక సముదాయాలు, దుకాణాల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వ్యాపారులకు సూచించారు. చేరువ కార్యక్రమంలో భాగంగా గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ సహా వివిధ వర్తక, వాణిజ్య సంఘ ప్రతినిధులతో కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులతో సత్సంబంధాలు పెంపొందేలా చేయడమే చేరువ కార్యక్రమం లక్ష్యమని ఎస్పీ అన్నారు. ప్రజాజీవనానికి ఆటంకం వాటిల్లకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు, రహదారి భద్రతకు పోలీసులకు సహకరించాలని కోరారు.