విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి

Apr 30 2025 12:20 AM | Updated on Apr 30 2025 12:20 AM

విద్య

విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి

తుని: రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫ్‌కేషన్‌ విడుదల చేయడంతో కష్టపడి ఉద్యోగం సాధించాలని కలలు కన్న విద్యార్థికి కొండంత కష్టం కలిగింది. ఐదేళ్లుగా డీఎస్సీ కోసం శ్రమిస్తున్న విద్యార్ధి నూకరత్నం ఆశలు అడియాశలు అయ్యాయి. ఆగ్ని ప్రమాదం రూపంలో కష్టార్జితం బూడిద పాలు కావడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం తుని మండలం సీహెచ్‌.అగ్రహరం గ్రామంలో రెండు పోర్షన్ల తాటాకు ఇంటికి నిప్పు అంటుకుని సర్వస్వం కోల్పోయారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... మదాసి లోవరాజు, సిరిసిపల్లి అమ్మాజీ కుటుంబాలు రెండు పోర్షన్లు తాటాకు ఇంటిలో ఉంటున్నారు. ఈ ప్రమాదంలో విలువైన వస్తువులు, నగదు ఆగ్నికి ఆహుతి అయ్యాయి. ఇందులో మదాసి లోవరాజు కుమార్తె నూకరత్నంకు చెందిన పది, ఇంటర్‌, డిగ్రీ ఒరిజనల్‌ సర్టిఫికెట్లు కాలిపోయాయి. దీంతో పాటు దాచుకున్న రూ.1.40 లక్షలు బూడిద పాలు అయ్యాయి. నూకరత్నం కోటనందూరులో హాస్టల్‌లో ఉంటూ డీఎస్సీకి సన్నద్ధం అవుతోంది. ఆగ్ని ప్రమాదం జరిగిందని, సర్టిఫికెట్లు కాలిపోయాయని తెలియడంతో తల్లిడిల్లింది. ఐదేళ్లుగా డీఎస్సీ కోసం ప్రిపేర్‌ అవుతున్నానని, ఒరిజనల్‌ సర్టిఫికెట్లు కాలిపోవడంతో భవిష్యత్‌ అంథకారం అయిందని కన్నీరు పెట్టుకుంది. ప్రభుత్వం ఆదుకోకపోతే భవిష్యత్‌ను కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేసింది. విద్యాశాఖ అధికారులు స్పందించి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాటు చేయాలని వేడుకుంది. తుని ఆగ్నిమాపక అధికారి రాముడు ఆధ్వర్యంలో మంటలను ఆర్పివేశారు.

నూకరత్నంకు అండగా వైఎస్సార్‌ సీపీ

ప్రమాదంలో సర్వం కోల్పోయిన రెండు కుటుంబాలకు వైఎస్సార్‌ సీపీ అండగా ఉంటుందని పార్టీ సీనియర్‌ నాయకుడు యనమల కృష్ణుడు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన బాధితులను మంగళవారం పరామర్శించారు. విద్యార్థి నూకరత్నం కన్నీటిని చూసిన వైఎస్సార్‌ సీపీ నాయకులు చలించిపోయారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించి సర్టిఫికెట్లు ఇచ్చేలా విద్యాశాఖ అధికారులను ఆదేశించాలన్నారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకువెళ్తామన్నారు. రెండు కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు పోల్నాటి శేషగిరిరావు, పోతల రమణ, సర్పంచ్‌ లంక సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు లంక తాతీలు, మామిడి శెట్టి శ్రీను,ఆవాడ సత్యనారాయణ, లంక చిన్నాలు, గోవిందు, చిట్టిబాబు, అప్పారావు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం

బాధితులకు అండగా వైఎస్సార్‌ సీపీ

విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి1
1/1

విద్యార్థిని సర్టిఫికెట్లు అగ్నికి ఆహుతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement