మనం మాత్రమే తయారు చేసిన ఈ అరుదైన పొట్టి మిర్చి విత్తనాన్ని తీసుకెళ్లి ఇతర రాష్ట్రాల్లో పండిస్తున్నారు. మన ఘనతను వారు సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి పంటను వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు తరలించేశారు. ఇతర దేశాల్లో అప్పట్లో గొల్లప్రోలు పేరు మార్మోగేది. ఇప్పుడు ఇక్కడ ఒక్క ఎకరం కూడా సాగు లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అరుదైన ఈ పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రైతుకు చేయూతనివ్వాలి.
– వెలుగుల బాబ్జీ, మిరప రైతు,
దుర్గాడ, గొల్లప్రోలు మండలం
ప్రకృతి సాగుకు చర్యలు
కేవలం రైతు ఆలోచన నుంచి పుట్టింది పొట్టి మిరప. దీనిలో డిమాండ్కు తగ్గట్టుగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. మారిన వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్లు, పురుగులు దాడి చేయడంతో ఇక్కడి రైతులు ఈ పంట సాగు నిలిపివేశారు. అన్ని తెగుళ్లనూ తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయ విధానంలో పొట్టి మిర్చి సాగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే రైతులను సన్నద్ధం చేస్తున్నాం.
– ఎలియాజర్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్,
ప్రకృతి వ్యవసాయ విభాగం, కాకినాడ
ప్రభుత్వం చేయూతనివ్వాలి