జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక

Mar 17 2025 12:09 AM | Updated on Mar 17 2025 12:09 AM

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు నిత్యశ్రీ ఎంపిక

పిఠాపురం: జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు పిఠాపురంనకు చెందిన ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆర్చరీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 10వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో అత్యధిక స్కోరింగ్‌ కొట్టిన ఆధారంగా ఈ నెల 15వ తేదీన రాత్రి ఎంపికై న ఆర్చరీ లిస్టును విడుదల చేశారు. అందులో పిఠాపురం నుంచి ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికయింది. ఈ నెల 22 నుంచి 29 వరకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న 6వ జాతీయస్థాయి అండర్‌ 10 ఇండియన్‌ రౌండ్‌ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ తరపున జాతీయస్థాయిలో ఆరేళ్ల ముమ్మిడి నిత్యశ్రీ ఎంపికై నట్టు కోచ్‌ పి.లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.శ్రీనివాస్‌ కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు కె.పద్మనాభం అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement