వెంబడించిన ఎక్సైజ్‌ పోలీసులు | - | Sakshi
Sakshi News home page

వెంబడించిన ఎక్సైజ్‌ పోలీసులు

Mar 9 2025 12:15 AM | Updated on Mar 9 2025 12:15 AM

వెంబడ

వెంబడించిన ఎక్సైజ్‌ పోలీసులు

బైక్‌ పై వేగంగా వెళుతూ లారీని ఢీకొన్న యువకులు

ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం

తాళ్లరేవు: యానాం – ద్రాక్షారామ రహదారిలోని ఇంజరం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప మండలం గురజనాపల్లి శివారు అడివిపూడి గ్రామానికి చెందిన కోట శ్రీరామ్‌ (21), పిఠాపురానికి చెందిన మరో యువకుడు పెద్దాపురంలోని ఒక కళాశాలలో చదువుతున్నారు. వీరు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం వచ్చి తిరిగి వెళుతుండగా మద్యం తరలిస్తున్నారనే అనుమానంతో సుంకరపాలెం ఎకై ్సజ్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు. అయితే వీరు బైక్‌ ఆపకుండా వెళ్లిపోవడంతో ఎకై ్సజ్‌ పోలీసులు వెంబడించారు. దీంతో వేగంగా బైక్‌ నడుపుతూ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కోట శ్రీరామ్‌కు తీవ్రగాయాలై రక్తస్రావమైంది. స్థానికులు హుటాహుటీన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మరో యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.

ఎకై ్సజ్‌ చెక్‌ పోస్టు ముట్టడి

యువకుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు ఎకై ్సజ్‌ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ముట్టడించారు. ఎకై ్సజ్‌ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే నిండుప్రాణం బలై పోయిందని సిబ్బందిని నిలదీశారు. డిపార్ట్‌మెంట్‌కు సంబంధం లేని ఒక ప్రైవేటు వ్యక్తిని మద్యం దుకాణాల వద్ద నిఘా పెట్టి.. అతడు ఇచ్చిన సమాచారంతో ప్రతి రోజూ ఇదే మాదిరిగా వేధిస్తున్నారన్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సుంకరపాలెం చెక్‌పోస్టు వద్ద పరిస్థితిని సమీక్షించారు.

తీవ్ర ఉద్రిక్తత

సుంకరపాలెం పరిసర గ్రామాల నుంచి అనేక మంది ప్రజలు ఎకై ్సజ్‌ చెక్‌పోస్టును ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోట శ్రీకాంత్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. వారితో కాకినాడ రూరల్‌ సీఐ చైతన్యకృష్ణ, ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరెంటెండెంట్‌ మౌనిక, ఎకై ్సజ్‌ సీఐ స్వామి చర్చిస్తున్నారు. ఇంద్రపాలెం, గొల్లపాలెం, తిమ్మాపురం ఎస్సైలు వీరబాబు, మోహన్‌కుమార్‌, రవీంద్ర శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

వెంబడించిన ఎక్సైజ్‌ పోలీసులు1
1/1

వెంబడించిన ఎక్సైజ్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement