అన్నవరం: రత్నగిరి గదుల రిజర్వేషన్ కార్యాలయ (సీఆర్వో) సిబ్బందిపై ఈఓ వీర్ల సుబ్బారావు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. హరిహరసదన్ పక్కన గల స్థలం ఈ నెల 22న వివాహానికి అద్దెకి తీసుకున్న పెళ్లిబృందం వివాహం అనంతరం ఆ స్థలం ఖాళీ చేసినప్పటికీ సిబ్బంది పది రోజుల వరకు కంప్యూటర్లో చెకౌట్ చేయని విషయం విదితమే. దీని ఫలితంగా ఈ స్థలం ఒక రోజు అద్దె రూ.29 వేలు కాగా, పది రోజులకు రూ.2.90 లక్షలు చెల్లించాలని కంప్యూటర్లో నమోదైంది. దీనికి బాధ్యులుగా భావిస్తూ సీఆర్వో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ పెన్నాడ వేంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ కార్యాలయంలో కౌంటర్ క్లర్క్గా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీకృష్ణను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలిచ్చారు.