
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు
గద్వాల: జూన్ 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఐడీవోసీ కార్యాలయంలోని తనఛాంబర్లో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఐడీవోసీ కార్యాలయాల సముదాయ భవన ఆవరణలో ఉదయం 10గంటలకు నిర్వహించే వేడుకలలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులకు దిశానిర్ధేశం చేశారు. వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా అట్టహాసంగా నిర్వహించాలని, అన్ని సంక్షేమాభివృద్ధి శాఖలకు చెందిన కార్యక్రమాలు ప్రతిబింభించేలా ప్రదర్శన స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గద్వాల పట్టణంలోని స్మృతివనం, పాతబస్టాండ్ వద్ద గల తెలంగాణ పోరాయోధుల విగ్రహాల వద్ద సభాస్థలి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. పరేడ్గ్రౌండ్లో పోలీసుగౌరవ వందనం, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పకడ్బందిగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్రావు, ఆర్డీవో శ్రీనివాస్రావు, ఏవో భూపాల్రెడ్డి, డీఎస్పీ మొగులయ్య, తహసీల్దార్, మున్సిపల్ కమీషనర్ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.