భూ భారతితో సమస్యలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

భూ భారతితో సమస్యలకు చెక్‌

Jun 4 2025 12:35 AM | Updated on Jun 4 2025 12:35 AM

భూ భా

భూ భారతితో సమస్యలకు చెక్‌

నిబంధనల మేరకు..

ధరణిలో నిషేధిత జాబితాలో ప్రభుత్వ భూముల, ఎండోమెంట్‌, భూదాన్‌, వక్ఫ్‌, కోర్టు కేసులకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీటిపై కూడా భూ భారతి చట్టం నిబంధనల మేరకు పరిష్కారం చూపుతాం.

3,500 దరఖాస్తులు పెండింగ్‌..

జిల్లాలో సాదాబైనామాల కింద 2,500 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే ధరణిలో వివిధ రకాల సమస్యలు, వివిధ దశల్లో మరో వెయ్యి వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికి భూ భారతి చట్టం ద్వారా పరిష్కారం చూపుతాం.

స్పష్టమైన ఆదేశాలు..

జిల్లావ్యాప్తంగా 18 రోజులపాటు నిర్వహించే రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన భూ సంబంధిత దరఖాస్తులను ఒక్కొక్కటిగా పరిశీలించి వాటి పరిష్కారం ఎక్కడెక్కడ ఉందో స్పష్టంగా తెలుసుకుని పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఇలా వచ్చిన మొత్తం దరఖాస్తులను ఆగస్టు 14 వరకు పరిష్కరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అందుకనుగుణంగా చర్యలు చేపడుతాం.

జిల్లావ్యాప్తంగా ప్రారంభమైనరెవెన్యూ సదస్సులు

గ్రామస్థాయిలో రెండు బృందాల పర్యటన

ఈ నెల 20 వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఆగస్టు 14 నాటికి పరిష్కారం

నిషేధిత జాబితా భూములకూ మోక్షం కల్పిస్తాం

‘సాక్షి’ ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ

గద్వాల: ‘అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భూ భారతి చట్టం–2025 రూపొందించింది. ఇప్పటికే భూ భారతి చట్టం కింద జిల్లాలో ఇటిక్యాల మండలాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ చట్టం భూ సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగకరంగా ఉంద’ని ఇందులో భాగంగానే జిల్లావ్యాప్తంగా ఈ నెల 2 నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 18 రోజులపాటు నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల నేపథ్యంలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడారు. భూ భారతి చట్టం–2025 అమలు తీరు, భూ సమస్యల పరిష్కారం వంటి అంశాలు, పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల సమస్యల పరిష్కారం వివరాలు ఆయన మాటల్లోనే..

12 మండలాలు.. 18 రోజులు

భూ భారతి చట్టం–2025 కింద ఇటిక్యాల మండలాన్ని ఎంపిక చేశాం. తాజాగా ఈ నెల 2 నుంచి 20వ తేదీ వరకు జిల్లాలోని 12 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిరహిస్తున్నాం. ఇందుకోసం తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేశాం. ఈ రెండు బృందాలు వారికి కేటాయించిన గ్రామాల్లో ప్రతిరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పర్యటిస్తారు. సమస్యలు ఉన్న వారితో నేరుగా మాట్లాడి వారి వద్ద దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ పర్యవేక్షిస్తారు.

చదువురాని వారికోసం..

భూ సమస్యలపై దరఖాస్తులు ఇచ్చే ఫిర్యాదుదారులతో నేరుగా దరఖాస్తు స్వీకరస్తారు. అయితే ఫిర్యాదుదారునికి చదువురాని పక్షంలో వారికోసం ప్రత్యేకంగా అక్కడే ఓ వ్యక్తిని ఏర్పాటు చేసి ఫిర్యాదుదారు చెప్పే సమస్యలను దరఖాస్తులో నమోదు చేసి అనంతరం సదరు ఫిర్యాదుదారునికి రశీదు ఇస్తాం.

భూ భారతితో సమస్యలకు చెక్‌ 1
1/1

భూ భారతితో సమస్యలకు చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement