
నూతన విత్తన చట్టం రూపకల్పనకు కృషి
గద్వాల/మల్దకల్/మానవపాడు: నూతన విత్తన చట్టం –2025 రూపకల్పనలో ప్రజల సూచనలు తీసుకొని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. బుధవారం ఐసీడీసీ మీటింగ్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం–2025 ముసాయిదా తయారి కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఈవిత్తన చట్ట ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడంతో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అందరి సూచనలు సలహాలు కమిటీ పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు నర్సింహరెడ్డి, శివప్రసాద్, (డీఏఓ సంగారెడ్డి) జిల్లా వ్యవసాయ అధికారి సక్రీయ నాయక్ , ఏడిఏలు, డీలర్లు తదితరుల ఉన్నారు.
బైబ్యాక్ విధానంలో ‘కంది’ కొనుగోలు
కంది రెడ్గ్రామ్లో పీఆర్జీ–176, ఎల్ఆర్జీ–52, మినుములు బ్లాక్గ్రామ్లో విబిఎన్–8 రకాల విత్తన పంటను బై బ్యాక్ విధానంలో కోనుగోలు చేస్తామన్నాని అన్వేష్రెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి అన్నారు. బుధవారం మల్దకల్, మానవపాడు ఏర్పాటుచేసిన సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. 900 రకాల ఉత్పత్తులను చేసి బై బ్యాక్ పద్ధతిలో విత్తనాభివృద్ధి సంస్థ కోనుగోలు చేస్తుందన్నారు. ఒప్పందం ప్రకారం మద్దతు రేట్ కంటే అధిక ధరను ఇచ్చి విత్తన పంటను కోనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంది, మినుములు బై బ్యాక్ పద్ధతిలో తప్పకుండా ప్రభుత్వం తరుపున కొనుగోలు చేస్తామని సూచించారు. అలాగే, రైతులు లైసెన్సు కలిగిన డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని, అప్పుడే దిగుబడులు సాధించవచ్చని అన్నారు. ఎరువులు, విత్తనాలు కొని తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, రసాయనిక ఎరువుల అధికంగా వాడడంతో పంటపొలాల భూసారం దెబ్బతిని పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో సీడ్డ్రప్ట్ బిల్ చైర్మన్ నరసింహరావు, మార్కెట్ చైర్మన్ దోడ్డెప్ప, మార్కెట్ వైస్ చైర్మన్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షులు శ్రీధర్రెడ్డి, టీఎస్ సీడ్ డీఎం ఆదినారాయణ, టీఎస్ సీడ్ ప్రాడెక్ట్ సంధ్యరాణి తదితరులు పాల్గొన్నారు.
రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేయాలి
తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ అన్వేష్రెడ్డి