ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Jun 6 2025 12:25 AM | Updated on Jun 6 2025 12:25 AM

ఉద్యో

ఉద్యోగ భద్రత కల్పించాలి

అలంపూర్‌: పురాతత్వ శాఖలో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. అలంపూర్‌ పట్టణంలోని పురాతత్వ శాఖ కార్యాలయం ముందు భారతీయ పురాతత్వ సర్వేక్షణ కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు గురువారం సమ్మె చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..పురాతత్వ సర్వేక్షణలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలను 75 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. 26 రోజులు ఉన్న పనిదినాలను 18 రోజులకు కుందించినట్లు వాపోయారు. పని చేసిన వారికి గత ఆరు నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. పదేళ్లకుపైగా పని చేస్తున్న వారిని రెగ్యులరైజ్‌ చేయకుండా ఔట్‌సోర్సింగ్‌కు మళ్లించినట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సురేష్‌, రవి, పాష, రంగ ఉన్నారు.

ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి

గద్వాల: రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గద్వాల రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన ఇథనాల్‌ పరిశ్రమను రద్దు చేయాలని 12 గ్రామాల రైతులు గత 9 నెలలుగా శాంతియుతంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. జనవరి నెలలో రైతుల నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరపున మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ పరిశ్రమను రద్దు చేస్తామని రైతులకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అర్థరాత్రి కంపెనీ యాజమాన్యం ఏకపక్షంగా పనులు చేపట్టారని విమర్శించారు. శాంతియుత నిరసన చేపట్టడానికి వచ్చిన రైతులపై దాడులు చేయడమే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపారని, అఖిలపక్ష, సామాజిక, ప్రజాసంఘాల,రాజకీయ పార్టీల నాయకులను బలవంతంగా నిర్భందంలోకి తీసుకున్నారని విమర్శించారు. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా, ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు రద్దు చేసి, రైతులపై దాడులకు పాల్పడిన కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని, రైతులపై పెట్టిన కేసును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, కుర్వ పల్లయ్య, వాల్మీకి సింగరాజు, మద్దిలేటి,సుబాన్‌,టవర్‌ మక్బూల్‌,ఆంజనేయులు, జమ్మిచెడు కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ భద్రత కల్పించాలి 1
1/1

ఉద్యోగ భద్రత కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement