
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
ధరూరు: ఆయిల్పాం తోటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని అదనపు కలెక్టర్ నర్సింగ్రావు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని ర్యాలంపాడు గ్రామంలో ఆయిల్పాం మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఆయిల్పాం ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా.. అందులో రూ.173 సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుందని, మిగిలిన రూ.20 మాత్రమే రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందిస్తారని, మిగిలిన చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందించడం జరుగుతుందన్నారు. ఆయిల్పాం తోట సాగు కోసం రూ.2,100, అంతర పంట సాగు కోసం మరో రూ.2,100 కలిపి ఏడాదికి రూ.4,200 ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఆయిల్పాం తోట సాగుకు ఖర్చు తక్కువగా ఉంటుందని, ఈ సాగు కోసం జిల్లాలోని రైతులు ముందుకు రావాలని ఆయన కోరారు.
వన్ టైం పరీక్ష రాసే
అవకాశం
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో బ్యాక్లాగ్ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు వన్టైం పరీక్ష రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సంవత్సరాల కోర్సు, అదనంగా రెండు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ కలిగి ఉండాలని, బ్యాక్లాగ్ ఉన్న విద్యార్థులకు ఇది చివరి అవకాశం అని, ఈ నెల 16వ తేదీ లోగా ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తులు చేసుకోవాలని, 20వ తేదీ వరకు జరిమానాతో ఫీజుచెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు