
ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
గద్వాల: వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి మొత్తం 75 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపించారు. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, పరిష్కారం కానిపక్షంలో అందుకు గల కారణాలు వివరిస్తూ సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్నాలెడ్డ్మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్కు 9 అర్జీలు
గద్వాల క్రైం: ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్లో మొత్తం 9 అర్జీలు వచ్చాయి. ఈమేరకు ఎస్పీ శ్రీనివాసరావు ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా భూ వివాదం, ఆస్తి తగదాలు, అప్పుగా తీసుకున్న వ్యక్తులు డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదులు రాగా.. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ బాధితులకు తెలిపారు.