రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి

May 4 2025 6:57 AM | Updated on May 4 2025 6:57 AM

రక్షణ

రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలోని అన్ని గనుల్లో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి అధికారులకు సూచించారు. జీఎం బొగ్గు ఉత్పత్తి, ఉత్పదాకతపై జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ కార్యాలయంలో అన్ని గనుల మేనేజర్లు, షిప్ట్‌ ఇన్‌చార్జ్‌లతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ... సంస్థ నిర్దేశించిన ప్రకారం లక్ష్యాలను సాధించేందుకు అందరూ కూడా కృషి చేయాలని కోరారు. ఎస్‌డీఎల్‌ యంత్రాల పనిగంటలు పెంచి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. కార్మికులకు తప్పనిసరిగా ఇన్సెంటివ్‌ రావాలంటే నిర్దేశించిన టన్నుల బొగ్గు రవాణా జరిగేలా చూడాలన్నారు. కార్మికులు 22రోజులకు తగ్గకుండా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, ప్రాజెక్ట్‌ అధికారులు, ఏజెంట్‌లు భిక్షమయ్య, వెంకటరమణ, అధికార ప్రతినిధి మారుతి, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు

సింగరేణి ఉన్నత పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణతతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి అభినందించి ప్రోత్సాహక బహుమతులను అందించారు. 548మార్కులు సాఽధించిన ఎం.ఆశ్రితతో పాటు 500పై మార్కులు సాధించిన విద్యార్థులకు జీఎం కార్యాలయంలో శనివారం ప్రోత్సాహక బహుమతులు అందించి అభినందించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించినందుకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించినట్లు జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం కవీంద్ర, పాఠశాల కరస్పాండెంట్‌ మారుతి, ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ, అధికారులు రాజు, శ్రావణ్‌కుమార్‌, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి

రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి1
1/1

రక్షణతో కూడిన ఉత్పత్తి చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement