గతేడాది కరోనా.. ఇప్పుడు బ్రూసోల్లోసిస్‌ | More Than 6000 People Test Positive for Brucellosis in China Lanzho | Sakshi
Sakshi News home page

చైనాలో మరో ఇన్‌ఫెక్షన్‌..

Nov 6 2020 10:45 AM | Updated on Nov 6 2020 10:49 AM

More Than 6000 People Test Positive for Brucellosis in China Lanzho - Sakshi

బీజింగ్‌: కరోనా వైరస్ఈ ప్రపంచంలోకి ప్రవేశించి దాదాపు ఏడాది కావాస్తోంది. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి బయటపడిందని భావిస్తున్న ఈ మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరో ఇన్‌ఫెక్షన్‌ వెలుగులోకి వచ్చింది. చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెల్లోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి పాజిటివ్ వచ్చినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది. ఇది కూడా స్థానికంగా ఉన్న ఓ వ్యాక్సిన్‌ ప్లాంట్‌ నుంచే ఏడాది క్రితం లీకైనట్లు సమాచారం. ఈ క్రమంలో లాన్‌జౌ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘పట్టణంలోని 55,725కి పరీక్షలు చేశాం. వీరిలో 6,620 మందికి పాజిటివ్‌గా తేలింది’ అని తెలిపారు. పశువుల మీద ఉండే బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని తెలిపారు. సెప్టెంబర్‌ 14 నాటికి కేసుల సంఖ్య 3,245 ఉండగా.. ప్రస్తుతం 6000 పైగా నమోదయ్యాయి.

బ్రూసెల్లోసిస్‌ లక్షణాలు
జంతువులతో ప్రత్యక్ష సంబంధం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో ఉండే ఏజెంట్లను పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కూడా ఫ్లూలో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎన్నటికి తగ్గకపోవచ్చు అని వైద్యులు తెలిపారు. ఈ మేరకు లాన్‌జౌ హెల్త్‌ కమిషన్‌ సెప్టెంబర్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. (చదవండి: సెకండ్‌ వేవ్‌.. తస్మాత్‌ జాగ్రత్త! )

చైనా యానిమల్ హస్బండ్రీ ఇండస్ట్రీ కో యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీ నుంచి ఇది బయటకు వచ్చిందని ప్రకటనలో తెలిపింది.  ‘కంపెనీ గత ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్యలో  బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ల తయారీకి గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది. ఆ తరువాత బ్యాక్టిరియాను కలుషితమైన వ్యర్థ వాయువులో వదిలివేయడంతో అవి ఏరోసోల్స్‌ని ఏర్పాటు చేశాయి. ఆ తరువాత గాలి ద్వారా అవి లాన్‌జౌ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ పరిసర ప్రాంతాలకు వ్యాప్తి చెందాయి. దాంతో మొదటి సారి గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ బ్రూసెల్లోసిస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చింది’ అని ఆరోగ్య కమిషన్ తెలిపింది. గ్లోబల్ టైమ్స్ ప్రకారం, బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వర్క్‌షాప్‌ను గత ఏడాది డిసెంబర్‌లో మూసివేశారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దీనిని కూల్చివేశారు.(చదవండి: పరిస్థితి పూర్తిగా నియంత్రణలోనే ఉంది..)

విదేశీ విమానాలపై బ్యాన్‌
వందేభారత్‌ మిషన్‌లో భాగాంగా తాజాగా భారత్‌ నుంచి చైనాకు వెళ్లిన ఎయిరిండియా విమానంలో 19 మంది భారతీయులకు కరోనా పాజిటివ్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనా భారత్‌తో సహా ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. నిషేధం తాత్కలికమేనని.. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని చైనా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement