స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ

Jun 26 2025 10:16 AM | Updated on Jun 26 2025 10:16 AM

స్పోర

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ

వరంగల్‌ స్పోర్ట్స్‌: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్‌, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్‌ను డీవైఎస్‌ఓ గుగులోతు అశోక్‌కుమార్‌ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపికలకు మొదటి రోజు 16 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్‌ స్కూల్స్‌ ఎంపికలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈఎంపిక ప్రక్రియలో డీఎస్‌ఏ కోచ్‌లు శ్రీమన్నారాయణ, మహ్మద్‌ అఫ్జల్‌, బొడ్డు విష్ణువర్ధన్‌, బత్తిని జీవన్‌గౌడ్‌, ఓనపాకల శంకర్‌, కూరపాటి రమేశ్‌, రాజారపు రమేశ్‌, దేవిక, రాజు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్‌, పీడీలు ప్రేమ్‌ప్రసాద్‌రావు, కిషన్‌నాయక్‌ పాల్గొన్నారు.

హార్టికల్చర్‌ ఆఫీసర్ల

బాధ్యతల స్వీకరణ

హనుమకొండ జిల్లాకు అనసూయ,

వరంగల్‌కు ఆర్‌.శ్రీనివాసరావు

హన్మకొండ: హనుమకొండ, వరంగల్‌ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారుల్లో మార్పులు జరిగాయి. వరంగల్‌ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్‌.శ్రీనివాస్‌, హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా జి.అనసూయ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్‌ కర్నూల్‌ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్‌ జిల్లా అధికారిగా పని చేస్తున్న సంగీత లక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉద్యాన శాఖ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. దీంతో వరంగల్‌ రీజియన్‌ పట్టు పరిశ్రమ జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న జి.అనసూయను హనుమకొండ, వరంగల్‌ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. కరీంనగర్‌ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పని చేస్తున్న ఆర్‌.శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై వరంగల్‌ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్‌ ఎస్‌.యాస్మీన్‌ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు హనుమకొండ, సుబేదారిలోని జిల్లా సమీకృత కార్యాలయం భవన సముదాయంలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

‘మత్తు’ నియంత్రణకు

పటిష్ట చర్యలు

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్‌ఓ గణేశ్‌, డీసీపీ షేక్‌ సలీమా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా హాళ్లలో మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్‌ వేసేలా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిరంతరం అవగాహన సదస్సు, కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడలు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కలిగేలా రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్‌ అధికారులు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు  ఎంపికలు షురూ1
1/1

స్పోర్ట్స్‌ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement