
విస్తృతంగా మొక్కలు నాటాలి
● కమిషనర్ చాహత్ బాజ్పాయ్
వరంగల్ అర్బన్: వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండలో మొక్కలు నాటే కొన్ని ప్రాంతాలను బుధవారం ఉదయం జాగింగ్ చేస్తూ ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాయంపేట టెంపుల్ ట్రీ విల్లాస్, కేఆర్ఆర్ టౌన్ షిప్లోని ప్లాట్లో పార్క్ అభివృద్ధి పనులు, మియావాకీ ప్లాంటేషన్, న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల నుంచి తెలంగాణ జంక్షన్ వరకు పరిశీలించారు. అక్కడే అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రశాంత్నగర్లోని ఎస్వీ స్కూల్ ఆఫ్ బధిరుల పాఠశాలలో ఓపెన్ ప్లాంటేషన్ నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్రాడేకర్, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, ఏసీపీ రజిత, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్కుమార్, సారంగం, ఏఈలు రాగి శ్రీకాంత్, మేనక శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పన్నెండు మోరీల ట్రాఫిక్ జంక్షన్ను
అభివృద్ధి చేయాలి
వరంగల్ హంటర్ రోడ్డు–పోతన– బీట్ బజార్ జంక్షన్లో పన్నెండు మోరీలుగా విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. బుధవారం సాయంత్రం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
స్మార్ట్సిటీ పనులకు డిసెంబర్ గడువు
వరంగల్ స్మార్ట్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చివరి గడువును డిసెంబరు నెలాఖరుగా ఖరారు చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న పనులకు గతంలో కేటాయించిన నిధులతోనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర స్మార్ట్సిటీ జాయింట్ డైరెక్టర్ రూప మిశ్రా ప్రకటించారు. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి రూప మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి
వందరోజుల యాక్షన్ ప్లాన్ను సమర్థవంతంగా అమలు చేయాలని సీడీఎంఏ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియానుంచి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.