యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌ | - | Sakshi
Sakshi News home page

యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌

Jun 25 2025 3:05 PM | Updated on Jun 25 2025 3:05 PM

యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌

యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్‌

హన్మకొండ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్‌ నిర్వీర్యం అవుతోందని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్‌ అన్నారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్‌ భవన్‌లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్‌ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల సమీప షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. పిల్లల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీజీనాబ్‌ ఏసీపీ సైదులు, సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ కె.ప్రహసిత్‌, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేర్‌అండ్‌క్యూర్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్‌, ప్రొహిబిషన్‌–ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో నర్సింగ్‌ ఆఫీసర్‌ అరుణకుమారి, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవి కృష్ణ, సఖి అడ్మిన్‌ పి.హైమావతి, జిల్లా మహిళా శక్తి కో–ఆర్డినేటర్‌ డి.కళ్యాణి, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ కో–ఆర్డినేటర్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

హనుమకొండ రెవెన్యూ అధికారి

వైవీ.గణేశ్‌

విద్యార్థులకు అవగాహన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement